నిజామాబాద్ : పట్టణంలోని కంటేశ్వర్ ఆర్మూర్ బైపాస్ చౌరస్తా నుండి నూతన సమీకృత కలెక్టరేట్ భవనం వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన సమీకృత కలెక్టరేట్ భవనానికి వెళ్ళడానికి వీలుగా జిల్లా ప్రజల సౌలభ్యం కొరకు నాలుగు లైన్ రోడ్డు, సెంటర్ మిడియన్ లైట్లు, ఎల్ఈడీ స్ట్రిప్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాం కిషన్ రావ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇగ గంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.