హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని రూపొందించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మిషన్ భగీరథను అభినందించిన కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ప్రశంసలే కాకుండా.. నిధులు కూడా విడుదలచేయాలని కోరారు. మిషన్ భగీరథకు అనేక అవార్డులు వచ్చాయని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల కష్టాలు తీర్చేలా పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఈ పథకాన్ని అధ్యయనం చేసిన కొన్ని రాష్ట్రాలు.. ఆయాచోట్ల అమలుచేస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజల కష్టాలు తీర్చిన శాఖకు మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.