హైదరాబాద్, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ): పచ్చదనం, పరిశుభ్రత పెంపుదలలో ఆదిలాబాద్ జిల్లా ముక్రా కే గ్రామం సాధిస్తున్న ప్రగతిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసించింది. గ్రామంలోని పల్లెప్రకృతి వనానికి సంబంధించిన వీడియోను కేంద్ర పంచాయతీరాజ్శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసిం ది. ప్రజాశ్రేయస్సు కోసం ఉద్యానవనాలు పెంచడం, ఉత్పాదకత, లాభదాయకతకు ఊతమిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు.