హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) అందజేసే గడువును మరో నెలపాటు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021-22 వానకాలం, యాసంగికి సంబంధించి ఇంకా సీఎమ్మార్ను రాష్ట్రం నుంచి ఇవ్వాల్సి ఉన్నది.
ఈ గడువు గత నెలాఖరుతో ముగియడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు గడువు పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఈ నెల 28 వరకు సీఎమ్మార్ గడువు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.