హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అగ్నిమాపక శాఖకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.142.61 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.47.53 కోట్లు కలిపి మొత్తం రూ.190.14 కోట్లను అగ్నిమాపక శాఖ ఖాతాలో జమ చేయనున్నదని పేర్కొన్నారు.
తెలంగాణతో పాటు అన్ని రాష్ర్టాలకు జనాభా ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసింది. వీటిల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.769.90 కోట్లు, మహారాష్ట్రకు రూ.615.48 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.397.54 కోట్లు, రాజస్థాన్కు రూ.391.64 కోట్లు, వెస్ట్బెంగాల్కు రూ.376.76 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ నిధులతో మరింత వస్తు సామగ్రిని సమకూర్చుకునే యోచనలో ఉన్నట్టు అడిషనల్ డీజీ తెలిపారు.