Hyderabad | హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన, విద్యా నిర్వహణ సంస్థ (NAARM)లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉద్యోగులు మరణించడం అక్కడి సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తాజాగా శుక్రవారం రాత్రి అనిల్ కుమార్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణించాడు. బిహార్కు చెందిన అనిల్ కుమార్ ట్రైనింగ్ నిమిత్తం హైదరాబాద్లోని నార్మ్కు వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలాడు. అతనికి చికిత్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గత ఆదివారం కూడా నార్మ్లో విషాదం చోటుచేసుకుంది. సైంటిస్ట్ దామోదర్ రాత్రి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించడంతో నార్మ్లో విషాదఛాయలు అలుముకున్నాయి.