మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులను మోసం చేస్తుందన్నారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.