హైదరాబాద్: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీస్లో పనిచేస్తున్న 1132 మంది సిబ్బందికి గ్యాలంట్రీ/సర్వీస్ మెడల్స్ను ప్రకటించింది. శౌర్య విభాగంలో రెండు ప్రెసిడెంట్స్ మెడల్స్, గ్యాలంట్రీలో 275 మెడల్స్, 102 మందికి పీఎస్ఎం మెడల్స్, 753 మందికి ఎంఎస్ఎం మెడల్స్ ప్రకటించింది.
కాగా, తెలంగాణ రాష్ర్టానికి 6 గ్యాలంటరీ పతకాలు, 2 రాష్ట్రపతి పతకాలు, 12 ఉత్తమ ప్రతిభా పతకాలు, 2 కరెక్షనల్ సర్వీసెస్ మెడల్స్ వచ్చాయి. ఈ పతకాలకు సంబంధించిన ఇప్పటికే ఆయా శాఖలకు రాష్ట్రపతి ఆఫీసు నుంచి సర్టిఫికెట్లు వచ్చాయి. వాటిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా విభాగాధిపతులు అందించనున్నారు. తర్వాత డీజీపీ ఆఫీసుకు వచ్చే మెడల్స్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోనున్నారు.