హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ బ్యాంకుల్లో వెంటనే అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాలకు బుధవారం అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవన్, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్రెడ్డి వినతిపత్రం అందజేశారు.
విధుల్లో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఎలాంటి పరిమితి లేకుండా 30 శాతం పెన్షన్ ఇవ్వాలని వారు కోరారు. ఈ ఉత్తర్వులను 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని, ఎన్పీఎస్ స్కీం కింద ప్రస్తుతం సంస్థ చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని వినతిపత్రంలో కోరారు.