కవాడిగూడ, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వానిది పూర్తిగా బీసీ వ్యతిరేక బడ్జెట్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ బీసీల ఆశలను వమ్ముచేసిందని మండిపడ్డారు. దోమలగూడలోని ఆ సంఘం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీగా ఉన్నదని మండిపడ్డారు.
రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రూ.15 వందల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. కేంద్రంలో 72 మంత్రిత్వశాఖలు ఉన్నాయని, 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి ఒక శాఖను ఏర్పాటుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీది పచ్చి బీసీ మోసకారి ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీసీల బడ్జెట్ను లక్ష కోట్లకు పెంచాలని, 5 వేల బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ కమిషన్కు రూ.50 వేల కోట్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.