హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగా ణ): తెలంగాణలో గర్భిణులకు అందజేస్తున్న కేసీఆర్ కిట్లో తమ వాటా రూపాయి కూడా లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్ కిట్ కింద ఇస్తున్న రూ.13 వేల సాయంతోపాటు రూ.2 వేల విలువైన సామగ్రికి అయ్యే ఖర్చును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తున్నదని స్వయంగా లోక్సభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అమలుపై తాజాగా ఓ ఎంపీ అడిగి న ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. పీఎంఎంవీవై కింద గర్భిణులకు కేవలం 5 వేలే అందిస్తున్నామని, తెలంగాణ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఈ పథకం అమలవుతున్నదని చెప్పింది. పీఎంఎంఈవై కింద 2018-19 నుంచి 2022-23 వరకు అన్ని రాష్ర్టాల్లో లబ్ధిపొందినవారి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని స్పష్టం చేసింది.