నల్లగొండ : ప్రజా స్వామ్యంలో విమర్శలు , ప్రతి విమర్శలు సహజమని శాసనమండలి చైర్మన్(Council Chairman ) గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ పోతే ఏ నాయకుడు ఏ పార్టీ మిగలదని అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై కేంద్ర ప్రభుత్వం చర్య ఆరోగ్యకరమైనది కాదన్నారు.
ర్లమెంటరీ వ్యవస్థ(Parliamentary system) ను వివాదం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వివరించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. సీబీఐ(CBI), ఈడీ(ED) , ఎన్ఫోర్స్మెంట్(Enforcement) సంస్థలతో కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందన్నారని విమర్శించారు.
గవర్నర్ వ్యవస్థను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను జీఎస్టీ పేరుతో హరిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విభజన చెంది తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న కేంద్రం కృష్ణ గోదావరి జలాలలో వాటా ఇప్పటివరకు తేల్చలేదని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. వామపక్షాలతో మునుగోడు ఎలక్షన్ లో కలిసి పని చేసిన మాట వాస్తవమని, కానీ భవిష్యత్తులో ఇరుపక్షాలు కలవాలని ఉంటే కలిసి పని చేస్తామన్నారు.