హైదరాబాద్, జనవరి12 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నే కొత్త మార్గదర్శకాలను జారీచేశామని, ఆ అధికారం తమకు ఉన్నదని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు శుక్రవారం నివేదించింది. కొత్త టీవోఆర్ ఎక్కడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అతిక్రమించబోదని వెల్లడించింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 మార్గదర్శకాల మేరకు కాకుండా అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంచాలని తెలంగాణ ప్రభు త్వం చేసిన ఫిర్యాదుపై ట్రిబ్యునల్- 2(కేడబ్ల్యూడీటీ)కు కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీచేసిన విషయం తెలిసిం దే. అయితే కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై అభ్యంతరాలను తెలుపుతూ ఏపీ సర్కారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేయాలని, కొత్త టీవోఆర్ చెల్లబోదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అది విరుద్ధమని వాదనలు వినిపించిం ది. దీనిపై కౌంటర్ వేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యం లో శుక్రవారం కేంద్రం తన అఫిడవిట్ను దాఖలు చేసింది. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్పై వాదనలను వినిపించేందుకు ఏపీ రెండు వారాల గడువును కోరగా, అందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.