హైదరాబాద్, ఫిబ్రవరి21 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకులాలకు చెందిన 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కళాశాలల్లో ప్రవేశాలకు రెండోదశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మెరిట్ ప్రకారం 1ః5 నిష్పత్తిలో విద్యార్థులను ఎంపిక చేశామని, వీరంతా పరీక్షకు హాజరుకావాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఎస్సీ గురుకులాల సొసైటీ వెబ్సైట్లో పొందుపరిచామని, హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.