గజ్వేల్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం వదిలేసి రిజర్వేషన్ల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని పౌర హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ జీ హరగోపాల్ విమర్శించారు. గజ్వేల్లో గురువారం రిజర్వేషన్లపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రోజురోజుకు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ, ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తూ ప్రైవేటు రంగాన్ని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు.