హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఏపీఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడకక్కడే మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
అల్లూరి జిల్లా సరిహద్దులోని చిత్రకొండ నుంచి జడంబోకు టిప్పర్ సిమెంట్లోడు, ఇనుప రాడ్లతో బయల్దేరింది. ఈ క్రమంలో టిప్పర్ హంతల్గూడ ఘాట్ రోడ్డులో బోల్తాకొట్టింది. ప్రమాద సమయంలో టిప్పర్పై 16 మంది కూలీలు కూడా ఉన్నారు. ఐదుగురు మృతిచెందారు. క్షతగాత్రులను పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు జోడాంబో ఆసుపత్రికి తరలించారు. బాధితులు నవరంగ్పూర్ జిల్లాకు చెందిన వారు అని పోలీసులు గుర్తించారు.