Social Media | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లో సెల్ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14-16 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నారు.
వయసులవారీగా చూస్తే.. 14 ఏండ్ల వయస్సుల్లో 79% మంది, 15 ఏండ్ల వయస్కుల్లో 82.2% మంది, 16 ఏండ్ల వయస్కుల్లో 82.5% మంది సోషల్ మీడియాలో మునిగిపోతున్నట్టు వార్షిక విద్యాస్థాయి నివేదిక (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు) వెల్లడించింది. 14-16 ఏండ్ల వయస్కులు విద్యకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు స్మార్ట్ఫోన్లను అంతంతమాత్రంగానే ఉపయోగిస్తున్నట్టు ఈ నివేదిక తేల్చింది.
బాలురే స్మార్ట్