మామిళ్లగూడెం, జూన్ 11: సినీఫక్కీలో ఓ సెల్ఫోన్ దుకాణంలో రూ.67లక్షల విలువైన ఫోన్లను దుండగులు ఎత్తుకెళారు. పో లీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం వైరా రోడ్డులోని సోనోవిజన్ షాపును బుధవా రం సాయంత్రం యజమాని మూసి వెళ్లా డు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు షట్టర్ తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడుతున్న క్రమంలో స్టోర్ మేనేజర్కు అలర్ట్ మెసేజ్ వెళ్లింంది. అందుబాటులో ఉన్న ఉ ద్యోగులకు సమాచారం ఇచ్చి స్టోర్కు పంపగా, అప్పటికే షాపులోని 167 సెల్ఫోన్లను దుండగులు అపహరించారు.
ఆ సమయంలో ఓ ఉద్యోగి స్టోర్ వద్దకు వచ్చి నిందితుల కారుకు తన బైకుతో అడ్డుకొనే ప్రయత్నం చేయగా, వారు తప్పించుకు న్నారు. చోరీలో నలుగురు పాల్గొన్నట్టు షాప్లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. స్టోర్కు కొత్త స్టాక్ వచ్చిన మరుసటి రోజే చోరీ జ రుగడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. స్టోర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఖమ్మం వన్టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఘటన స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్దత్ పరిశీలించి, నిందితుల కోసం బృందాలు ఏర్పాటుచేశారు.