యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్గ్ర హైకోర్టు న్యాయమూర్తి సుధ, ఎండోమెంటల్ గౌరవ అధ్యక్షుడు రవీందర్ శర్మ, ఏపీ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా వేరు వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, అద్దాల మండపంలో వేద అరశీర్వచనం ఇవ్వగా, అధికారులు ప్రసాదం అందజేశారు.
కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.