హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరంలో 2023 తానా మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బాంక్వెట్ విందుతో ఈ మూడురోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా.. అందరూ ఒక్కటేనని తెలిపారు. ఎన్నారైలు పుట్టిపెరిగిన పల్లెలు, విద్య నేర్చుకున్న పాఠశాలల అభివృద్ధికి తమవంతుగా చేయూతనివ్వాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి తానా పురసారాలు అందజేసి సతరించారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్లా కృష్ణ కీలకోపన్యాసం చేశారు. సింగర్ చిత్ర.. సంగీత విభావరి అలరించింది. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి, కో ఆర్డినేటర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ చైర్మన్ ఎల్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రము ఖ నిర్మాత దిల్రాజు, నటులు రాజేంద్రప్రసాద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.