హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రగ్స్, అతిగా మద్యం తాగి న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. న్యూఇయర్ వేళ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.