న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను (Polling Stations) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 27,798 కేంద్రాల్లో (78 శాతం) వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇక 597 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా 644 మోడల్ కేంద్రాలు, మరో 120 పోలింగ్ కేంద్రాలను వికలాంగుల కోసం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మందికి ఓటు హక్కు ఉన్నదని సీఈసీ తెలిపారు. వారిలో 1.58 కోట్ల మంది పురుషులు ఉండగా, 1.58 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. ఇక 8.11 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని చెప్పారు.