హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్పై సీసీఎస్ దర్యాప్తు కొనసాగుతున్నది. రూ.64 కోట్లు దారిమళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.8 కోట్ల డిపాజిట్ విత్డ్రాపై చందానగర్ కెనరా బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో రూ.330 కోట్లు డిపాజిట్ చేసింది.
అయితే యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకులోని డిపాజిట్లు మాయమైన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకు సిబ్బంది పాత్రపై అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సరైన పత్రాలు చూశాకే డిపాజిట్ క్లోజ్ చేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. డిపాజిట్ల రద్దు వెనక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అకాడమీ డైరెక్టర్, ఇన్చార్జ్, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. బ్యాంకు అధికారులను మరోసారి విచారించనున్నారు.