హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ దవాఖానల్లో చేయని చికిత్సలను చేసినట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ను కాజేసిన నలుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్లగొండ జిల్లాలోని చెరువుతండా జాన్పహాడ్కు చెందిన బీ జ్యోతి (రూ.1,52,196), బీ లక్ష్మి (రూ.1,50,567), కేశవపూర్ మండలం దుబ్బతండాకు చెందిన దీరవత్నగర్ (రూ.1,50,272), చాలకుర్తి పెద్దవూరకు చెందిన రమావత్ శివ (రూ.1,55,854) మిర్యాలగూడలోని మహేశ్ మల్టీస్పెషాలిటీ దవాఖాన, ఖమ్మం నెహ్రునగర్లోని వినాయక సూపర్ స్పెషాలిటీ దవాఖానలో చికిత్స పొందినట్టు బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ పొందినట్టు తేలింది. దీంతో వారిపై సీసీఎస్ పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు.