హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): జీఆర్ఈ, టోఫెల్ మాస్ కాపీయింగ్ ఘటనలో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్టు కాగా, మాస్కాపీయింగ్ చేస్తున్న మరో 20 మందిని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారే హైదరాబాద్లో 20 అడ్డాలను ఏర్పాటు చేసి ఐదారు నెలలుగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు.
ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా పరీక్ష రాసే వెసులుబాటు ఉండటంతో రాయ్పూర్లో ఎన్ఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రావణ్, ఆదిత్య, గుణశేఖర్, సాయి సంతోష్, కిశోర్, కిరణ్కుమార్ టోఫెల్, జీఆర్ఈ పరీక్ష రాసే వారి నుంచి రూ.20 వేలు తీసుకొని పరీక్షలో మాస్ కాపీయింగ్ చేస్తూ, ఎక్కువ మార్కులు తెప్పిస్తున్నారు. దీన్ని గుర్తించిన ఈటీఎస్.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 500 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్టు పోలీసులు గుర్తించారు, వంద మంది పేర్లను సేకరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలను రాబట్టనున్నారు.