యాదాద్రి, సెప్టెంబర్ 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల లెక్క ఇక పక్కాగా ఉండనున్నది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులపై పటిష్ఠమైన నిఘా వ్యవస్థతోపాటు వారి సం ఖ్యను లెక్కించేందుకు ప్రత్యేక కెమెరాను ఏర్పా టు చేశారు. ప్రధానాలయ తూర్పు రాజగోపురం వద్ద హెడ్ కౌంటింగ్ కెమెరాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలయ తూర్పు పంచతల రాజగోపురం నుంచి త్రితల రాజగోపురం మీదుగా భక్తులు ప్రధానాలయంలోకి వెళ్లి స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకొంటారు.
అక్కడి నుంచి పశ్చిమ పంచతల రాజగోపురం మీదుగా సప్తతల రాజగోపురం నుంచి బయటకు వెళ్తారు. ధర్మ దర్శనం, రూ.150 టికెట్ దర్శనాలతోపాటు వీఐపీ భక్తులు తప్పనిసరిగా తూర్పు గోపురం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులను లెక్కించేందుకు తూర్పు పంచతల రాజగోపురం ఎదురుగా హెడ్ కౌంటింగ్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా.. ఆఫ్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా కంప్యూటర్లోకి సమాచారం చేరవేస్తుంది. ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరినీ కెమెరా లెక్కించనున్నది.