హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో 2022 డిసెంబర్లోనే కవితను సీబీఐ విచారించింది. వాంగ్మూలం కూడా నమోదు చేసింది. ఇదిలాఉండగా ఇప్పటికే ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్నది.