హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు విడుదలచేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్చేసిన హైదరాబాద్ సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) ఎలక్ట్రికల్ ఈఈ సాయి సీబీఐకి చిక్కాడు. రూ.20 లక్షల పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు సాయి రూ.60 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ సీబీఐలోని ఏసీబీ హైదరాబాద్ విభాగానికి ఫిర్యాదుచేశారు. రూ.45 వేలు చెల్లించాన ని, రూ.15 వేల కోసం వేధిస్తున్నట్టు వివరించారు. సాయి మంగళవారం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇల్లు, ఆఫీస్లో సోదాలుచేసి రూ.31.84 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, 27 కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సీబీఐ ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు.
ఇవీ కూడా చదవండి
రైతును రాజు చేయడమే సీఎం ధ్యేయం