మాగనూరు, నవంబర్ 23 : నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అని మాగనూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు నరసింహారెడ్డి, అశోక్రెడ్డి, బీజేపీ నేత నల్లి నరసప్ప, కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డితోపాటు పలువురు రైతులకు కేసు నమోదు చేశారు.