కరీంనగర్ కోర్టుచౌరస్తా, ఫిబ్రవరి 6: కేసు కోర్టు విచారణలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతూ అంబులెన్స్లో వ చ్చిన ఫిర్యాదుదారు వద్దకే వెళ్లి న్యాయ మూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగింది. చిగురుమామిడి మండలకేంద్రానికి చెందిన అనువోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుళ్లు,కొడుకు.వారికిపెండ్లిండ్లు అ య్యాయి. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నది. రాజేశ్వరిని కొడుకు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఆర్డీవోకు ఫిర్యా దు చేసింది. నెలకు రూ.4వేల పోషణకు ఇవ్వాలని ఆర్డీవో వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారు. కొడుకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె చిగురుమామిడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకటేశ్వర్లుపై కేసు నమోదుచేశారు. కోర్టులో కేసు విచారణకు రాగా ఫిర్యాదుదారు సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. రాజేశ్వరి పక్షవాతంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉండగా, అంబులెన్స్లో కోర్టుకు తీసుకువచ్చారు. రాజేశ్వరి వద్దకు న్యాయమూర్తి బానోత్ రాజేశ్వర్ వెళ్లి వాంగ్మూలాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరస్వామి, న్యాయవాది వేణుగోపాల్ సమక్షంలో నమోదు చేశారు. రాజేశ్వరి తన కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం.