KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మరో కేసు నమోదైంది. నిన్న ఏసీబీ విచారణ అనంతరం అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేటీఆర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బాల్క సుమన్, మన్నె గోవర్దన్, క్రిశాంక్, జైసింహా తదితరులపై 305, ఆర్/డబ్ల్యూ 62 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.