హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిష్టి బొమ్మ తగలబెట్టిన(Burning effigy) 8 మందిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి(Peddapalli) ఎంపీ టికెట్ 80 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలకు కాకుండా మాలలకు కేటాయించినందుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలట్టారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఘటనలో 8 మంది పై కేసులు నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్ఐ నరేష్ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాదిగ కులానికి చెందిన మేధావులు, విద్యార్థులు మండి పడుతున్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ సీట్ల(Parliament Elections) కేటాయింపులో మాదిగలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అధిక శాతం ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించకపోవడంతో పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు.