హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎన్టీఆర్ పార్క్ ఎదుట హుస్సేన్సాగర్లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న యువకులను బయటకుతీసి.. యశోద దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులను ఖైరతాబాద్కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్గా గుర్తించారు. కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నారని, ఖైరతాబాద్ నుంచి అఫ్జల్గంజ్లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.