మహబూబ్నగర్ : కారు డ్రైవర్ ( Car Driver ) అజాగ్రత్త కారణంగా మహిళా స్కూటరిస్టు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్నగర్ ( Mahabubnagar ) లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రిస్సిల్లా(45) అనే మహిళ స్కూటీపై వస్తుండగా రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారు డ్రైవర్ డోర్ను తెరిచాడు.
దీంతో మహిళా కారును ఢీకొని రోడ్డుపై పడిపోయింది. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్..!
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ మృతి
మహబూబ్నగర్లో ఓ కారు డ్రైవర్ అకస్మాత్తుగా కారు డోర్ తెరవడంతో.. డోర్ తగిలి స్కూటీ పై వస్తున్న ప్రిస్సిల్లా(45) అనే మహిళ మృతి
తీవ్రంగా గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతిచెందిన మహిళ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో… pic.twitter.com/BLqx9Qvi7n
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026