అమరావతి : ఏపీ కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బావిలో పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట వద్ద ఘటన జరిగింది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో కారు నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది.
అయితే, కారు వేగంగా వచ్చిందని.. స్పీడ్ను నియంత్రించలేకపోవడంతోనే బావిలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బావి 30 అడుగుల లోతు వరకు ఉంటుందని, పూర్తిగా నీటమునగడంతో గజ ఈతగాళ్ల సహాయంతో కారులో ఉన్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.