సూర్యాపేట: జిల్లాలోని మునగాలలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు విద్యార్థులతో వెళ్తున్న ఆటో (School auto) మునగాల సర్కారు దవాఖాన వద్ద రోడ్డు దాటుతున్నది. ఈ క్రమంలో ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.