హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రెండు వేల నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శిం చారు.
ఆగమేఘాల మీద రెండు వేల నోట్లను ప్రవేశపెట్టిన కేంద్రం ఏం సాధించిందో చెప్పలేదని, ఇప్పుడు వాటిని ఉపసంహరించడం ద్వారా ఏం సాధించబోతున్నదీ చెప్పలేదని ఎద్దేవా చేశారు.