యాదాద్రి: యాదగిరిగుట్టలోని (Yadagirigutta) యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ (Canada Minister Deepak Anand) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకున్న కెనడా మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న దీపక్ ఆనంద్ దంపతులు.. నారసింహునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, వేదాశీర్వాదం అందించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగిన మంత్రి.. క్షేత్ర నిర్మాణాన్ని పరిశీలించారు.
కాగా, ఆషాఢ బోనాల సదర్భంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లోని టీ హబ్లో (T-Hub) మంత్రి దీపక్ ఆనంద్, ఆయన సతీమణి అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ఐటీ ఉద్యోగులతో కలిసి పాల్గొన్నారు.