హైదరాబాద్: గుజరాత్లోని ఓ గ్రామంలో ఇటీవల ఓ మాజీ సర్పంచ్ రూ.50 లక్షల నగదు వెదజల్లాడు. తన మేనల్లుడి పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఓ భవనంపై నిలబడి.. ఊరేగింపును చూసేందుకు వచ్చిన జనంపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. సర్పంచ్ విసిరినవి అన్నీ రూ.500 నోట్లే కావడంతో జనం వాటిని అందుకునేందుకు ఎగబడ్డారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత, రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి YSR పేరుతో ఉన్న తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇంత భారీ మొత్తంలో నగదు వెదజల్లినందుకు ఇక్కడ ‘ఐటీ సర్వే’ జరుగుతుందని అంచనా వేయొచ్చా..?’ అంటూ ఆ వీడియోతోపాటే తన ఫాలోవర్స్కు ఒక ప్రశ్నను సంధించారు. బీబీసీ కార్యాలయాలపై ఐటీ సర్వేలను ఉద్దేశించి సతీశ్రెడ్డి పై ప్రశ్న వేశారు.
Ex sarpanch of a village in #Gujarat, showered money on people gathered to witness his nephew’s wedding celebrations,
Reportedly more than ₹50,00,000 were showered at one go. Can we expect any ‘IT Survey’ here? pic.twitter.com/mhRtbv3aUH
— YSR (@ysathishreddy) February 19, 2023
కాగా, సతీశ్రెడ్డి ట్వీట్పై ట్విటర్ యూజర్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. ఒక్కో యూజర్ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ‘ఐటీ సర్వేలు అస్సలే జరగవు’ అని ఓ యూజర్ పేర్కొనగా, ‘మేం సౌత్ ఇండియాలో మాత్రమే రైడ్స్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మాత్రమే బీజేపీకి అధికారం లేదు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.
‘డబుల్ ఇంజిన్ అవినీతిపై ఇంత వరకు ఐటీ దాడులు జరగలేదు’ అని మరో యూజర్ చమత్కరించగా.. ‘ఐటీ సర్వేలు జరగవు. ఎందుకంటే వెదజల్లిన నగదును తీసుకెళ్లి కేంద్ర హోమంత్రికి ఇచ్చేందుకు అక్కడ ఐటీ టీమ్ రెడీగా ఉంది. ఆ డబ్బు మరో ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు పనికొస్తుంది’ అని ఇంకో ట్విటర్ యూజర్ ఎద్దేవా చేశాడు.
‘గుజరాత్లో అన్నింటికి అనుమతి ఉంటుంది. డబ్బులు వెదజల్లడం, హత్యలు, హింసలు, అవినీతి, దేశం వదిలి పారిపోవడం ఇలా ఏదైనా అక్కడ సాధ్యమే’ అని మరో ట్విటర్ యూజర్ వ్యంగ్యాస్త్రం సంధించగా.. ‘అవి అసలు నోట్లు కానే కావు, అన్నీ నకిలీ నోట్లే’ అంటూ ఇంకో ట్విటర్ యూజర్ కామెడీ కామెంట్ చేశాడు.