ఐటీ మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం
ఆయన నుంచి స్ఫూర్తి పొందా
కాలిఫోర్నియా కమిషనర్ రఘురెడ్డి ప్రశంస
హైదరాబాద్, ఏప్రిల్ 4 : అమెరికా పర్యటనలో భాగంగా రాష్ర్టానికి పెట్టుబడులు సాధించేందుకు ఐటీమంత్రి కే తారకరామారావు చేసిన కృషిని కాలిఫోర్నియా కమిషనర్ రఘురెడ్డి ప్రశంసించారు. పెట్టుబడుల సాధనకు కేటీఆర్ పడిన తపన తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. తాను ఎంతోమంది రాజకీయ నేతలు, మంత్రులను కలిశానని, కానీ, కేటీఆర్ను కలిసిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, స్ఫూర్తి పొందానని తెలిపారు. కేటీఆర్ తెలివైన, వినయ విధేయతలు కలిగిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఐటీశాఖ మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని కొనియాడారు. కేటీఆర్ సంకల్పంతోనే ఐటీ, ఫార్మా, లైఫ్సైన్సెస్, రిసెర్చ్ సెంటర్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని పేర్కొన్నారు. వీటిద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణలో పెట్టుబడులకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
టీఆర్కు టీఎస్టీడీసీ చైర్మన్ శుభాకాంక్షలు
అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని రూ.7500 కోట్ల పెట్టుబడులతో రాష్ర్టానికి తిరిగి వచ్చిన మంత్రి కేటీఆర్ను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా కలిశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో సోమవారం మం త్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.