హైదరాబాద్, జనవరి31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన ఆడిట్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. ఈ మేరకు తెలంగాణ అకౌంటెంట్ జనరల్ అనింద్యాదాస్ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో కాగ్ నివేదికపై చర్చించనున్నారు.