GO 317 | వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317 కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇందులో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రకభార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. సబ్ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నది. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చింది.. జీవోలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
జీవో నంబర్ 317, 46తో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై, పలు అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలతో పాటు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 14న సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర ఆదేశించారు. అభిప్రాయాలు, వినతులు కమిటీకి చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా సైతం అవకాశం కల్పించాలని చెప్పారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యలను తెలుపుకునేందుకు ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ను సబ్ కమిటీ ఆదేశించింది. గ్రీవెన్స్ సెల్కు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల శాఖ సెక్రెటరీని నోడల్ అధికారిగా నియమించారు. సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, పీఆర్సీ కమిటీ చైర్మన్ శివ శంకర్, సెక్రటేరియట్ సర్వీసెస్ సెక్రెటరీ నిర్మల, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.