హైదరాబాద్: విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం (Cabinet sub committee) భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ (Minister KTR), హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. టెట్ (TET) నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.