హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో వీరంతా పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం రెండో విడత సెకండ్ ఫేజ్ చేపట్టడం, ఫీజు రెగ్యులేటరీ (ఫీజుల నియంత్రణ), టీచర్ల నియామక (టెట్, డీఎస్సీ నిర్వహణ) ప్రక్రియ తదితర అంశాలు ఉపసంఘం సమావేశ ఎజెండాలో ఉన్నాయి.