హైదరాబాద్ : రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అనుమతి లేని లేఔట్లు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ, గ్రామకంఠాలు, ఇతర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.