హైదరాబాద్: పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavati Rathod ) అధ్యక్షతన క్యాబినెట్ సబ్కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అయితే, తమకు అప్పగించిన బాధ్యతలపై చర్చించడం కోసం ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన కమిటీ.. ఇవాళ మూడోసారి సమావేశమైంది. బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఈ సమావేశం జరుగుతున్నది.
ఈ క్యాబినెట్ సబ్కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, అటవీ శాఖ పీసీసీఎఫ్ శ్రీమతి శోభ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.