హైదరాబాద్: ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో మోదీకి వ్యతిరేకంగా రాజధానిలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలుస్తున్నాయి. గురువారం పరేండ్ గ్రౌండ్స్ పరిసరాల్లో బైబై మోదీ హ్యాస్ట్యాగ్తో సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ భారీ హోర్డింగ్లు వెలసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆర్థిక నేరగాళ్ల వేషంలో ఉన్న కొందరు.. మేం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం.. మీరు మొత్తం దేశాన్నే లూటీచేస్తున్నారని ప్లకార్డులు పట్టుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిల్చున్నారు. వినూత్న వేషధారణలో ఉన్న వీరు జనాలను ఆకట్టుకుంటున్నారు.
‘WE ONLY ROB BANK.. YOU ROB THE WHOLE NATION’ #BYEBYE MODI అని రాసిఉన్న ప్ల కార్డులను పట్టుకుని నగరంలోని పలు బ్యాంకులు, పెట్రోల్ బంకులు, కాచీగూడ రైల్వే స్టేషన్, బీహెచ్ఈఎల్, జహీరాబాద్లోని ఎల్ఐసీ ఆఫీస్ వద్ద వీరు దర్శనమిచ్చారు.