ఏటూరునాగారం, ఫిబ్రవరి 27 : రైతు భూమి కొలిచేందుకు లంచం తీసుకుంటూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సర్వేయర్ (ఔట్ సోర్సింగ్) బొచ్చు మహేందర్ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారానికి చెందిన ఎర్రబెల్లి మనోహర్రావు (ఎన్ఆర్ఐ) అనే రైతుకు రాంనగర్ ప్రాంతంలో ఉన్న భూమిలో తన కుమార్తెకు 5.34 ఎకరాలు వాటాగా ఇచ్చాడు.
ఈ భూమిని పక్కనున్న వారు ఆక్రమించుకున్నారని సర్వే చేసి ఇవ్వాలని గతేడాది మే నెలలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడు సర్వే జరగకపోవడంతో జనవరి నెలలో మళ్లీ సర్వే కోసం దరఖాస్తు చేశాడు. ఈ నెల 6న సర్వేయర్ బొచ్చు మహేందర్ను సర్వే కోసం కలువగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సోమవారం మధ్యాహ్నం సర్వే చేసిన తర్వాత పంచాయతీరాజ్ కార్యాలయ సమీపంలో మహేందర్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు
పట్టుకున్నారు.