నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ సీపీ నాగరాజు మాట్లాడుతూ.. దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించటం వల్ల సుమారు రూ.7 లక్షల 30 వేల నగదు కాలిపోయిందన్నారు. అలాగే రూ.3.50 కోట్ల విలువ గల 8 కిలోల పైచిలుకు బంగారం వరకు చోరీ అయినట్టు వివరాలను వెల్లడించారు. దొంగలు అంతరాష్ట్ర ముఠాగా అనుమానంగా ఉందని, త్వరలో నే దొంగలను పట్టుకుంటామని సీపీ తెలిపారు.