ఓదెల : గూడ్స్ రైలు మీద బస్సులు వెళ్తున్న దృశ్యం పెద్దపల్లి జిల్లాలో స్థానికులను ఆకట్టుకొన్నది. కర్నాటక నుంచి హిమాచల్ప్రదేశ్కు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను గూడ్స్లో తీసుకెళ్లారు.
కొత్తగా తయారు చేయించిన వీటిని రోడ్డు మార్గంలో కాకుండా రైలులో తరలిస్తుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. గురువారం ఇలా గూడ్స్లో బస్సులు వెళ్తుండగా కొలనూర్ రైల్వే స్టేషన్లో ‘నమస్తే’ క్లిక్ మనిపించింది.